కేరళ తొలి ట్రాన్స్‌జెండర్ లాయర్‌గా పద్మాలక్ష్మి

by Dishafeatures2 |
కేరళ తొలి ట్రాన్స్‌జెండర్ లాయర్‌గా పద్మాలక్ష్మి
X

తిరువనంతపురం: కేరళలో తొలి ట్రాన్స్ జెండర్ న్యాయవాది పద్మా లక్ష్మీ నిలిచారు. ఈ మేరకు రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ సోషల్ మీడియాలో తెలిపారు. జీవితంలోని సంక్షోభాలను అన్నింటిని అధిగమించి కేరళ తొలి ట్రాన్స్‌జెండర్ న్యాయవాదిగా ఎన్‌రోల్ చేసిన పద్మాలక్ష్మీకి అభినందనలు చెప్పారు. మొదటి వ్యక్తి అనేది చరిత్రలో ఎప్పుడూ కష్టమైన విజయమని అన్నారు.

పద్మాలక్ష్మీ కొత్త అధ్యయాన్ని లిఖించిందని చెప్పారు. పద్మా లక్ష్మీ ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి పట్టాను పొందారు. దీనిపై నెటిజన్లు అభినందనలు చెబుతూ కామెంట్లు చేశారు.


Next Story

Most Viewed