తీవ్రరూపం దాల్చిన మహిళా ఐఏఎస్‌, ఐపీఎస్‌‌ల మధ్య వివాదం.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం

by Malleboina Mahesh |   (  Updated:2023-02-21 06:35:14  IST  )

కర్ణాటకలోని ఐపీఎస్ అధికారిణి డి రూప మౌద్గిల్, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

తీవ్రరూపం దాల్చిన మహిళా ఐఏఎస్‌, ఐపీఎస్‌‌ల మధ్య వివాదం.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలోని ఐపీఎస్ అధికారిణి డి రూప మౌద్గిల్, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు అధికారులు ఒకరిపై మరొకరు పరస్పరం బహిరంగంగా ఆరోపణలు చేసుకున్నారు. దీంతో కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర సోమవారం అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే తాము మౌనంగా కూర్చో బోమని.. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా ఐపీఎస్ అధికారిణి డి రూప మౌద్గిల్, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి వీధుల్లో మామూలు మనుషులు కూడా మాట్లాడని విధంగా దారుణంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.

Next Story