కైలాస మానస సరోవరంకు చేరుకున్న ఫస్ట్ బ్యాచ్.. చైనా ప్రకటన

by Naga Rani Yarlagadda |

భారతీయ భక్తులకు శుభవార్త. హిందువులకు అత్యంత పవిత్రంగా భావించే కైలాస్‌-మానస సరోవర్‌ యాత్ర ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైంది.

కైలాస మానస సరోవరంకు చేరుకున్న ఫస్ట్ బ్యాచ్.. చైనా ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ భక్తులకు శుభవార్త. హిందువులకు అత్యంత పవిత్రంగా భావించే కైలాస్‌-మానస సరోవర్‌ యాత్ర ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైంది. ఫస్ట్ బ్యాచ్ గా 36 మంది భారత యాత్రికులు మానసరోవర్ సరస్సు వద్దకు చేరుకున్నట్లు చైనా అధికారులు అధికారికంగా వెల్లడించారు. టిబెట్‌లోని జియాంగ్‌ స్వాయత్త ప్రాంతంలోని మాపవ్‌ యున్‌ సో సరస్సు వద్ద యాత్రికులు గురువారం ఉదయం చేరుకున్నారని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

కైలాస్ పర్వతాన్ని పార్వతీ పరమేశ్వరుల నివాసంగా భావిస్తూ హిందువులతో పాటు బౌద్ధులు, జైనులు కూడా ఎంతో పవిత్ర స్థలంగా గౌరవిస్తారు. 2020లో కరోనా మహమ్మారి వల్ల ఈ యాత్ర నిలిచిపోయింది. ఆ తర్వాత జరిగిన గల్వాన్ సంఘటనతో భారత్-చైనా సంబంధాలు మరింత మందగించాయి. దాంతో యాత్ర పునరుద్ధరణ యత్నాలు ఆగిపోయాయి. విమాన సర్వీసులు కూడా ఆ సమయంలో నిలిపివేయడం జరిగింది.

ఇటీవల బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు మార్గం సాఫీ అయింది. గత ఏడాది ఏప్రిల్ 27న భారత ప్రభుత్వం యాత్ర పునఃప్రారంభం కానుందని ప్రకటించింది. ఈ యాత్ర ఉత్తరాఖండ్‌, సిక్కింలో ప్రారంభం అవుతుందని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.

Next Story