జడ్జి వర్సెస్ జడ్జి వ్యవహారం .. ఆ కేసులో న్యాయ విచారణ ఆపండి: సుప్రీంకోర్టు

by Dishanational4 |
జడ్జి వర్సెస్ జడ్జి వ్యవహారం .. ఆ కేసులో న్యాయ విచారణ ఆపండి: సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి సౌమెన్ సేన్‌పై అదే కోర్టుకు చెందిన మరో న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ చేసిన అధికార దుర్వినియోగం ఆరోపణలపై సుప్రీంకోర్టులో శనివారం విచారణ జరిగింది. బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా న్యాయమూర్తి సౌమెన్ సేన్‌ తీర్పులు ఇస్తున్నారనే అభియోగాలకు సంబంధించిన పిటిషన్లను దేశ సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించింది. మెడికల్ కాలేజీలలో అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులకు నకిలీ కులం సర్టిఫికెట్లను జారీ చేశారనే అంశంపై తీర్పులిచ్చే విషయంలో ఇద్దరు న్యాయమూర్తుల మధ్య ఏర్పడిన వైరుధ్యాల వివరాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం సమీక్షించింది. ఈ వ్యవహారంలో కోల్‌కతా హైకోర్టులో ఇక లీగల్ ప్రొసీడింగ్స్‌ను ఆపేయాలని ఆదేశించింది. నకిలీ కులం సర్టిఫికెట్ల కుంభకోణంపై సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. దీనిపై సమాధానం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. నకిలీ కుల ధృవీకరణ పత్రాల కుంభకోణంపై కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి వాదనలను సోమవారం రోజు వింటామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

Next Story

Most Viewed