49 మంది అభ్యర్థులతో జేడీఎస్ రెండో జాబితా

by Disha Web Desk 16 |
49 మంది అభ్యర్థులతో జేడీఎస్ రెండో జాబితా
X

బెంగళూరు: కర్ణాటకలో మరోసారి కింగ్ మేకర్‌గా నిలవాలని ఉవ్విళ్లురుతున్న జేడీఎస్ రెండో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. శుక్రవారం మాజీ సీఎం కుమారస్వామి, రేవన్న సంయుక్తంగా 49 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తాజా జాబితాలో స్వరూప్‌కు హసన్ స్థానం కేటాయించారు. కుమారస్వామి సోదరుడు రేవన్న భార్య ఈ స్థానం కోసం ప్రయత్నాలు చేసిన ప్రయోజనం లేకపోయింది. అయితే కుమారస్వామి స్వరూప్ వైపే మొగ్గు చూపారు. సోదరుడు రేవన్నకు హోలేనరసిపుర, లింగేష్‌కు బెలూర్, హెచ్‌కే కుమారస్వామికి సక్లేష్ పూర్ స్థానాల నుంచి టికెట్లు కేటాయించారు. జేడీఎస్‌‌కు తిరిగొచ్చిన వైఎస్వీ దత్తాకు కడుర్ నియోజకవర్గం కేటాయించారు. మరోవైపు జేడీఎస్‌కు మరింత బలం పెరిగింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ రఘు ఆచార్, బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు దొడ్డప్పగౌడ పాటిల్, గురులింగప్ప గౌడ, గురు పాటిల్ జేడీఎస్‌లో చేరారు.

Next Story