- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇన్సూరెన్స్ కోసం ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే..
దిశ, వెబ్డెస్క్: రూ.20లక్షల ఇన్సూరెన్స్ కోసం ఓ భార్య 45 ఏళ్ల భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన జార్ఖండ్ లోని ఖుంటి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నక్సల్ ప్రభావిత ప్రాంతమైన కుంతీలోని రానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుధీర్ గ్రామానికి చెందిన వాసిల్ సూరిన్ భార్య మరియమ్ సూరిన్. ఖుంటి జిల్లాలో నింధియా గ్రామానికి చెందిన 40 ఏళ్ల సైమన్ ఈంద్తో వివాహేతర సంబంధం ఉంది.
ఇద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. అయితే తన భర్తకు రూ.20లక్షల బీమా చేయించినట్లు భార్య చెప్పింది. దీంతో తమకు అడ్డుగా ఉన్నాడని, చంపితే రూ.20లక్షల బీమా డబ్బులు వస్తాయని భావించి భర్తను హత్య చేశారు. అయితే హత్య జరిగిన 72 గంటల్లోనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి ఆరుగురు పిల్లలున్నారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలు పాలవడంతో పిల్లలంతా రోడ్డున పడ్డారు.