ఓటు హక్కు వినియోగించుకున్న నారాయణమూర్తి దంపతులు

by Dishafeatures2 |
ఓటు హక్కు వినియోగించుకున్న నారాయణమూర్తి దంపతులు
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఇప్పటికే సీఎం బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్ప, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, నటుడు ప్రకాశ్ రాజ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా ఇన్పోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7గంటలకే పోలింగ్ బూత్ కు చేరుకున్న వారిద్దరూ క్యూలైన్ లో నిలబడి ఓటు వేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తాము వృద్ధులమైనా ఉదయం 6 గంటల వరకే పోలింగ్ కేంద్రానికి వచ్చామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడమనేది అత్యంత ప్రాధాన్యమైన విషయం అని వారు తెలిపారు. కాగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్ నారాయణమూర్తి దంపతుల అల్లుడు అనే విషయం తెలిసిందే.

Read More: కొనసాగుతున్న కర్ణాటక ఎన్నికలు.. 224 నియోజకవర్గాల్లో పోలింగ్

మొదలైన కర్ణాటక పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం, మాజీ సీఎం

Next Story