- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త
by Ajay Maddhiboyina |
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రత్యేక రైళ్ల సేవలను నవంబర్ నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రత్యేక రైళ్ల సేవలను నవంబర్ నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తిరుపతి-షిర్డీ, నరసాపురం-తరువణ్ణామలై లాంటి మార్గాలలో వారంతపు ప్రత్యేక రైళ్లు నవంబర్ 24 వరకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.
అంతే కాకాకుండా హైదరాబాద్- కన్యాకుమారి, కాచిగూడ-మధురై, హైదరాబాద్-కొల్లాం రైళ్లను కూడా పొడిగించింది. ఇదిలా ఉంటే పండుగల సమయాల్లో సరిపోయే అన్ని బస్సులు, రైళ్లు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటారు. స్కూళ్లకు , ఆఫీసులకు సెలవులు ఉండటంతో ఇతర ప్రాంతాల్లో నివసించేవాళ్లంతా సొంతూరికి పయనం అవుతారు. రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి.
Next Story






