ఆస్ట్రేలియాలో పర్యటించనున్న టీమ్ ఇండియా

by Ajay Maddhiboyina |   (  Updated:2025-03-30 14:01:25  IST  )

మహిళల జట్టు ఆసీస్ పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 15న ఈ పర్యటన ప్రారంభమై మార్చి 9న ముగియనుంది.

ఆస్ట్రేలియాలో పర్యటించనున్న టీమ్ ఇండియా
X

- అక్టోబర్, నవంబర్‌లో సిరీస్

- 3 వన్డేలు, 5 టీ20లు ఆడనున్న పురుషుల టీమ్

- ఒక టెస్టుతో పాటు వన్డే, టీ20లు ఆడనున్న మహిళల టీమ్

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా పురుషుల, మహిళల జట్లు ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. భారత పురుషుల జట్టు ఈ పర్యటనలో మూడు వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ మొత్తం 8 మ్యాచ్‌లు కూడా ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో ఆడనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటన నవంబర్ 8న ముగుస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు టీ20 క్రికెట్ మీద ఫోకస్ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఇండియా, శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ జట్టు సాధ్యమైనంత ఎక్కువగా టీ20 క్రికెట్ ఆడాలని నిర్ణయించింది. ఇక మహిళల జట్టు ఆసీస్ పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 15న ఈ పర్యటన ప్రారంభమై మార్చి 9న ముగియనుంది. పెర్త్‌లోని వాకా స్టేడియంలో ఒక టెస్టు జరగనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.

షెడ్యూల్:

పురుషుల టీమ్

వన్డేలు

1. అక్టోబర్ 19 - పెర్త్

2. అక్టోబర్ 23 - అడిలైడ్

3. అక్టోబర్ 25 - సిడ్నీ

టీ20లు

1. అక్టోబర్ 29 - కాన్‌బెర్రా

2. అక్టోబర్ 31 - మెల్‌బోర్న్

3. నవంబర్ 2 - హోబాట్

4. నవంబర్ 6 - గోల్డ్‌కోస్ట్

5. నవంబర్ 8 - బ్రిస్బేన్

మహిళల టీమ్

టీ20లు

1. ఫిబ్రవరి 15 - సిడ్నీ

2. ఫిబ్రవరి 19 - మనుకా ఓవల్

3. ఫిబ్రవరి 21 - అడిలైడ్ ఓవల్

వన్డేలు

1. ఫిబ్రవరి 24 - అలెన్ బోర్డర్ ఫిల్డ్, బ్రిస్బేన్

2. ఫిబ్రవరి 27 - హోబాట్

3. మార్చి 1 - సిటీ పవర్ సెంటర్, మెల్‌బోర్న్

టెస్టు

1. మార్చి 6-9 - వాకా గ్రౌండ్, పెర్త్

Next Story