భారత్, సౌదీ అరేబియా సైనిక విన్యాసాలు: ఇరు దేశాల లక్ష్యం అదే

by Dishanational2 |
భారత్, సౌదీ అరేబియా సైనిక విన్యాసాలు: ఇరు దేశాల లక్ష్యం అదే
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, సౌదీ అరేబియాల సంయుక్త సైనిక విన్యాసాలు రాజస్థాన్‌లో సోమవారం ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి తమ తొలి సంయుక్త విన్యాసాలను ప్రారంభించినట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ‘సదా తన్సీక్’ పేరుతో చేపట్టే ఈ విన్యాసాలు ఫిబ్రవరి 10వరకు కొనసాగనున్నాయి. ఇందులో సౌదీ అరేబియా నుంచి 45 మంది, ఇండియన్ ఆర్మీకి చెందిన 45 మంది సైనికులు పాల్గొననున్నారు. ఈ డ్రిల్స్‌లో మొబైల్ వెహికల్ చెక్ పోస్ట్‌లు, కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు, హౌస్ ఇంటర్‌వెన్షన్ డ్రిల్స్, రిఫ్లెక్స్ షూటింగ్, స్లిథరింగ్, స్నిపర్ ఫైరింగ్‌ల ఏర్పాటు ఉంటుంది. ‘యునైటెడ్ నేషన్స్ చార్టర్ VII అధ్యాయం ప్రకారం సెమీ-ఎడారి భూభాగంలో ఉమ్మడి కార్యకలాపాల కోసం దళాలకు శిక్షణ ఇవ్వడం ఈ వ్యాయామం లక్ష్యం. ఇది ఇరు దేశాల సైనికుల మధ్య పరస్పర చర్య, బంధుత్వం, స్నేహాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది’ అని ఆర్మీ పేర్కొంది.

భద్రతా లక్ష్యాల సాధననకు తోడ్పాటు

భాగస్వామ్య భద్రతా లక్ష్యాలను సాధించడానికి, రక్షణ సహకార స్థాయిని మెరుగుపరచడానికి, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి ఈ వ్యాయామం ఒక వేదికగా ఉపయోగపడనుంది. అంతేగాక భారత్, సౌదీ అరేబియా దళాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడం, ఉమ్మడి కార్యాచరణను మెరుగుపర్చేందుకు దోహదపడుతుంది. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై ప్రాథమిక దృష్టి సారించిన ఈ వ్యాయామం.. ప్రాంతీయ భద్రత, స్థిరత్వం పట్ల రెండు దేశాల నిబద్ధతను నొక్కి చెబుతుందని ఆర్మీ భావిస్తోంది.

Next Story

Most Viewed