- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా టెర్రర్.. ఇండియాలో ఇవాళ ఒక్కరోజే ఎన్ని కేసులు అంటే ?
కరోనా మహమ్మారి మళ్లీ తెరపైకి వచ్చింది. అందరినీ టెన్షన్ పడుతోంది ఈ మహమ్మారి కరోనా. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి మళ్లీ తెరపైకి వచ్చింది. అందరినీ టెన్షన్ పడుతోంది ఈ మహమ్మారి కరోనా. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఈ కరోనా మహమ్మారి... ఇండియాలో క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇండియా వ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 164 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ 164 కరోనా కేసులలో ఎక్కువగా కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయి.
కేరళలో 24 గంటల్లోనే.. 69 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అటు మహారాష్ట్రలో 44 కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలో 34 కొత్త కరోనా కేసులు నమోదు అయినట్లు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటన చేసింది. ఓవరాల్ గా ఇప్పటివరకు.. 257 కరోనా యాక్టివ్ కేసులు ఇండియా వ్యాప్తంగా ఉన్నట్లు అధికార ప్రకటన కూడా విడుదలైంది. కరోనా మహమ్మారి పట్ల టెన్షన్ అవసరం లేదని... జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.






