- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భారత్ - పాక్ యుద్ధం.. చైనా శాంతి మంత్రం వెనుక అంతా స్వా్ర్థమేనా?

దిశ, వెబ్డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత నేవీ (Indian Navy), ఆర్మీ (Indian Army), ఎయిర్ ఫోర్స్ (Indian Airforce) దాడులు చేయగా.. పాక్ ఆర్మీ (Pak Army) ఎదురు దాడులకు పాల్పడటంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇరుదేశాల మధ్య యుద్ధం జరుగుతుండటంపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. శాంతంగా ఉండాలని, సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాయి. అలాంటి దేశాల్లో చైనా కూడా ఒకటి. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే ఇక్కడ చైనా భారత్ కు సపోర్ట్ చేయడం లేదు. కానీ.. యుద్ధం జరగకూడదని మాత్రం కోరుకుంటోంది. ఇందులో చైనా స్వార్థం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
భారత్, పాకిస్థాన్ (India Pakistan War)లు చైనాకి పొరుగు దేశాలని, టెర్రరిజాన్ని తామెప్పుడూ వ్యతిరేకిస్తామని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. అలాగే పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత వైమానిక దాడులపై కూడా విచారం వ్యక్తం చేసింది. ఎందుకంటే పాకిస్థాన్ లో చైనా పెట్టుబడులు భారీగానే ఉన్నాయి. 2005-2024 మధ్యకాలంలో చైనా.. ఏకంగా 68 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. చైనా - పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్, బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుల్లో భాగంగా బీజింగ్ భారీగా పెట్టుబడులు పెట్టింది. భారత్ - పాకిస్థాన్ ల మధ్య యుద్ధం తీవ్రమైతే.. రోడ్డు మార్గం ద్వారా మిడిల్ ఆసియాను అనుసంధానించాలనుకునే చైనా కలల ప్రాజెక్ట్ ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు. ఈ విషయాన్ని బెన్నెత్ యూనివర్సిటీలో చైనా వ్యవహారాల నిపుణుడు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తిలక్ ఝా అంగీకరించారు. మరోవైపు అమెరికా టారిఫ్ లు కూడా చైనాకు తలనొప్పిగా మారాయి. ఇలాంటి సమయంలో యుద్ధం జరిగితే భారత్ తో ఉన్న సత్సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అటు పాకిస్థాన్ లో తన వ్యాపార కార్యకలాపాలకు బ్రేక్ పడే అవకాశాలే ఎక్కువ.
1951 మే 21 నుంచి చైనా - పాకిస్థాన్ ల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యాయి. దశాబ్దాల కాలంగా ఇరుదేశాల మధ్య రక్షణ రంగ సహకారం, దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. పైగా పాకిస్థాన్ ఆర్థికంగా చైనాపై ఆధారపడింది. ఇప్పుడు పాకిస్థాన్ కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగ్వామిగా ఉంది. భారీగా దిగుమతులు కూడా చేసుకుంటోంది. చైనా కస్టమ్స్ డిపార్ట్ మెంట్ లెక్కలప్రకారం చూస్తే.. 2024లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 23.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. పాకిస్థాన్ కు ఎగుమతులు 17 శాతం పెరిగి 20.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2.4 బిలియన్ డాలర్ల విలువైన అణు రియాక్టర్లు, బాయిలర్లు, మెషినరీ మెకానికల్ పరికరాలతో పాటు.. 1.3 బిలియన్ డాలర్ల విలువైన ఐరన్, స్టీల్ ఉత్పత్తుల్ని సైతం ఎగుమతి చేసింది. గడిచిన ఐదేళ్లలో పాక్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 81 శాతం ఆయుధాలు చైనావేనని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) నివేదిక తెలిపింది. పీఎల్ -15, ఎస్ డీ -10, పీఎల్ -15 వంటి క్షిపణులు కూడా సప్లై చేసింది. పాకిస్థాన్ తో ఇంత పెద్దఎత్తున వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న చైనా.. భారత్- పాక్ ల మధ్య యుద్ధం జరగానలని కోరుకోదు. ఇరుదేశాల మధ్య శాంతియుత వాతావరణమే చైనా వ్యాపారానికి మంచిది. లేదంటే ఆర్థిక అస్థిరత వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. అందుకే చైనా ఇరుదేశాల మధ్య శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటోంది.