- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
India: దక్షిణాసియాలో ఆందోళనకరంగా గాలి నాణ్యత

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. వాయునాణ్యత పడిపోతుంది. కాగా.. 2024 సంవత్సరానికి గానూ దక్షిణాసియాలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. ఈ విషయం స్విట్జర్ల్యాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ వెల్లడించిన ప్రపంచ వాయు నాణ్యత నివేదికలో వెల్లడైంది. భారతదేశంలో గాలి గాణ్యతలో మెరుగుదల ఉన్నప్పటికీ.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత దేశాలుగా నిలిచాయంది. దక్షిణాసియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు పట్టణీకరణ, పారిశ్రామిక కార్యకలాపాలు, వాతావరణ పరిస్థితుల వల్ల తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నట్లు నివేదిక పేర్కొంది. అత్యధిక వాయు కాలుష్యం గల ప్రపంచ నగరాల జాబితాలో బంగ్లాదేశ్ రెండోస్థానంలో, పాక్ మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉంది. కాగా.. గతంతో పోలిస్తే మూడు నుంచి ఐదో స్థానానికి చేరినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు తొలగినట్టు కాదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఐలాండ్, ఫిన్లాండ్..
ఈ నివేదికను శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు గుర్తించిన పీఎం 2.5 స్థాయి కాలుష్య కారకం ఆధారంగా రూపొందించారు. మరోవైపు, బలమైన పర్యావరణ విధానాలు, స్థిరమైన పద్ధతుల కారణంగా ఐలాండ్, న్యూజిలాండ్, ఫిన్లాండ్ వంటి దేశాల్లో వాయుకాలుష్యం తక్కువగా ఉంది. ఆ దేశాల్లో స్వచ్ఛమైన గాలి ఉంది. ఈ దేశాలు తమ పౌరుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా పరిశుభ్రమైన, పచ్చని వాతావరణాలను కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాసియా వంటి ప్రాంతాలలో వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి నిరంతర ప్రయత్నాల అవసరాన్ని ఐక్యూ ఎయిర్ నివేదిక నొక్కి చెబుతుంది. భారత్, పాక్, బంగ్లాదేశ్ లు వాయు కాలుష్య ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు స్థిరమైన పద్ధతులు, పర్యావరణ విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలంది.