దాడి చేసేందుకు భారత్‌కు పూర్తి హక్కు ఉంది: ఇజ్రాయెల్ మద్ధతు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-07 13:57:27  IST  )

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) చేపట్టింది.

దాడి చేసేందుకు భారత్‌కు పూర్తి హక్కు ఉంది: ఇజ్రాయెల్ మద్ధతు
X

దిశ, వెబ్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) చేపట్టింది. అర్థరాత్రి 1:44 గంటలకు పాక్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసింది. ఈ చర్యతో పాక్‌ వెన్నులో వణుకు పుట్టించింది భారత్. ఈ క్రమంలోనే భారత్ 'ఆపరేషన్ సింధూర్'కు ఇజ్రాయెల్ (Isreal) పూర్తి మద్ధతు తెలిపింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేయడాన్ని సమర్థించింది. ఇండియాకు ఆత్మరక్షణ హక్కు ఉందని ఇజ్రాయెల్ అంబాసిడర్ ర్యూవెన్ అజర్ ఈ మేరకు ట్వీట్ చేశారు. అమాయకులపై దాడికి పాల్పడే ఉగ్రవాదులకు జీవించే హక్కు లేదని పేర్కొన్నారు. #OperationSindoor అనే హ్యాష్ ట్యాగ్ జోడించారు.

కాగా, ఇప్పటికే ‘ఆపరేషన్ సింధూర్’‌పై స్పందించిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio).. ఉగ్రవాదులపై చర్య తీసుకుని హక్కు భారత్‌కు ఉందని తెలిపారు. దీనికి కౌంటర్‌గా పాక్ ఎలాంటి చర్యల తీసుకొవద్దని సూచించారు. భారత్‌పై యుద్ధానికి ధైర్యం చేయవద్దని సలహా ఇచ్చారు. అదేవిధంగా పాక్‌లో ఉగ్ర స్థావరాలపై దాడులను భారత విదేశాంగ శాఖ ఇప్పటికే అమెరికా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈ, రష్యా దేశాలకు వివరించింది.

Click For Tweet..

Next Story