పాక్ దురాక్రమణ వల్లనే పీవోకే అల్లర్లు.. దాయాది దేశపై భారత్ విమర్శలు

by Phanindra |

పాక్ దురాక్రమణ వల్లనే పీవోకే అల్లర్లు జరుగుతున్నాయని భారత్ విమర్శలు చేసింది. ఇక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై పాక్‌ను నిలదీయాలని కోరింది.

పాక్ దురాక్రమణ వల్లనే పీవోకే అల్లర్లు.. దాయాది దేశపై భారత్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కొన్ని రోజులుగా చెలరేగుతున్న అల్లర్లకు పాక్ ప్రభుత్వమే కారణమని భారత్ మండిపడింది. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 12 మంది మరణించగా.. 150 మందికిపైగా గాయపడ్డారు. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పాకిస్తాన్ అణచివేత, ఆక్రమణ వల్లనే ఈ అల్లర్లు చెలరేగుతున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ అన్నారు. ‘పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లో నిరసనల గురించి విన్నాం. ఈ ఆందోళనల్లో స్థానిక ప్రజలపై పాక్ దళాలు క్రూరంగా దాడులు చేసిన విషయం కూడా మా దృష్టికి వచ్చింది’ అని జైస్వాల్ తెలిపారు.

ఈ క్రమంలోనే పీవోకేలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాక్‌ను నిలదీయాలని ప్రపంచ దేశాలను కోరింది. ఈ ప్రాంతంలోని సంపదను దోచుకెళ్లడం, అణచివేత వల్లనే పీవోకేలో అల్లర్లు చెలరేగుతున్నాయని, ఈ నిరసనలను అణచివేసే క్రమంలో పాక్ దళాలు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని భారత్ ఆరోపించింది.

Next Story