India Alliance : పార్లమెంట్‌ ప్రాంగణంలో ఇండియా కూటమి సభ్యుల నిరసన

by Y. Venkata Narasimha Reddy |

పార్లమెంట్‌ ప్రాంగణం(Parliament premises)లో ఇండియా కూటమి(India Alliance)సభ్యుల నిరసనకు దిగారు. పార్లమెంట్‌లో అదానీ అంశంపై చర్చించాలంటూ విపక్ష ఇండియా కూటమి పార్టీల సభ్యులు ఆందోళన చేపట్టారు.

India Alliance : పార్లమెంట్‌ ప్రాంగణంలో ఇండియా కూటమి సభ్యుల నిరసన
X

దిశ, వెబ్ డెస్క్ : పార్లమెంట్‌ ప్రాంగణం(Parliament premises)లో ఇండియా కూటమి(India Alliance)సభ్యుల నిరసనకు దిగారు. పార్లమెంట్‌లో అదానీ అంశంపై చర్చించాలంటూ విపక్ష ఇండియా కూటమి పార్టీల సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)పాల్గొన్నారు. ర్లమెంట్‌లో అదానీ అంశంపై చర్చించాలంటూ విపక్షాల పట్టుబడుతున్న నేపథ్యంలో వరుసగా పార్లమెంట్‌ ఉభయసభలు వాయిదా పడుతున్నాయి. ఇదే అంశంపై గురువారం మరోసారి లోక్ సభ వాయిదా పడింది. దీంతో ఈ అంశంపై విపక్షాలు పార్లమెంటు ప్రాంగణంలో నిరసనకు దిగాయి.

అటు కాంగ్రెస్ కు, అమెరికన్ వ్యాపార వేత్త జార్జ్ సోరోస్ కు మధ్య బంధాన్ని బయటపెట్టాలంటూ బీజేపీ సభ్యుల డిమాండ్ తో సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య గందరగోళం చెలరేగగా, చైర్మన్ ధన్కడ్ సభను వాయిదా వేశారు.

Next Story