- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుబాయ్ ఎయిర్పోర్ట్ వద్ద భారీ పేలుడు.. ఇరాన్ డ్రోన్ దాడితో చెలరేగిన మంటలు
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడితో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఎక్కడికక్కడ విమానాలను నిలిపివేశారు.

దిశ, వెబ్డెస్క్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పీక్స్కు చేరింది. ఇవాళ తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Dubai International Airport) సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విమానాశ్రయానికి సమీపంలోని ఓ ఇంధన ట్యాంక్ (Fuel Tank)పై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో ఈ మంటలు చెలరేగాయి. భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ విమానాశ్రయంలో విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అనేక విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని దుబాయ్ మీడియా ఆఫీస్ అధికారికంగా ప్రకటించింది.
కాగా, ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ (Iran) ఇప్పటివరకు యూఏఈ (UAE) పై సుమారు 1,800 కంటే ఎక్కువ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. గత వారం కూడా విమానాశ్రయంపై జరిగిన దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేతతో పాటు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది.






