శబరిమలలో భారీ రద్దీ.. వారిని తీసుకు రావొద్దు

by Muthe.Rajitha |

శబరిమలకు అయ్యప్పస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

శబరిమలలో భారీ రద్దీ.. వారిని తీసుకు రావొద్దు
X

దిశ, వెబ్ డెస్క్ : శబరిమలకు అయ్యప్పస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గత రెండు రోజుల్లోనే 2 లక్షల మంది అయ్యప్ప భక్తులు శబరిమల చేరున్నారు. దీంతో స్వామి దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. కిలోమీటర్ల మేర భక్తుల పడిగాపులు కాస్తున్నారు. దర్శనానికి వచ్చే చిన్నారి స్వాములు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో శబరిమలకు చిన్నారులను తీసుకువెళ్లే స్వాములకు అధికారులు కీలక సూచనలు చేసారు. తీవ్ర రద్దీ ఉండటం వలన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, మరో నాలుగు రోజుల దాకా వారిని తీసుకురాకపోవడం ఉత్తమం అని చెబుతున్నారు.

Next Story