- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Meghalaya honeymoon murder Case : హనీమూన్ మర్డర్ కేసు.. ఇకపై కఠిన చర్యలన్న సర్కార్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు(Honeymoon Murder Case) గురించి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు(Honeymoon Murder Case) గురించి తెలిసిందే. పెళ్ళయిన తర్వాత హనీమూన్ పేరుతో మేఘాలయ(Meghalaya)కు తీసుకువెళ్ళి రాజా రఘువంశీని కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించింది సోనమ్(Sonam). తొలుత ఈ ఘటనపై మేఘాలయ రాష్ట్రంపై పలు విమర్శలు వచ్చాయి. ఇష్టం లేని పెళ్లి చేయడంతో భార్యే హత్య చేయించిందని అనంతరం పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మర్డర్ కేసు నేపథ్యంలో మేఘాలయ సర్కార్ చర్యలకు దిగింది. అక్కడి ప్రజల సేఫ్టీ కోసం పర్యాటక చట్టాన్ని మరింత కఠినతరం చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి పాల్ లింగ్డో తెలిపారు. టూరిజం పేరుతో రాష్ట్రంలోకి నేరస్తులు అడుగు పెడితే సహించబోమని, వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ రాష్ట్ర ప్రజలు చాలా శాంతి, అహింసా పరులని.. అలాంటి వారిపై నిందలు పడనివ్వబోమని స్పష్టం చేశారు.






