రాజ్యసభకు హరివంశ్ నారాయణ్ సింగ్.. నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

by Kema Shiva Kumar |

హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభకు పునరాగమనం చేయనున్నారు. రంజన్ గొగోయ్ రిటైర్మెంట్‌తో ఏర్పడిన ఖాళీలో హరివంశ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు.

రాజ్యసభకు హరివంశ్ నారాయణ్ సింగ్.. నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ (Harivansh Narayan Singh) మళ్లీ ఎగువ సభకు ఎన్నిక కాబోతున్నార. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ (Ranjan Gogoi) పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీలో హరివంశ్‌ను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu)నామినేట్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం, వివిధ రంగాల్లో నిష్ణాతులైన 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. ఇందులో భాగంగానే హరివంశ్ నారాయణ్ సింగ్‌కు ఈ అవకాశం దక్కింది.

కాగా, బీహార్ నుంచి జేడీయూ (JD-U) తరపున ఎన్నికైన హరివంశ్ సభ్యత్వ కాలం నిన్నటితో ముగిసింది. అయితే, సభలో ఆయన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఆయనను నామినేటెడ్ కోటాలో మళ్లీ ఎగువ సభకు పంపింది. గతంలో ఆయన రాజ్యసభ 13వ డిప్యూటీ చైర్మన్‌గా సమర్థవంతంగా పనిచేశారు. తాజా నామినేషన్‌తో ఆయన మళ్లీ అదే పదవికి పోటీ చేసే లేదా సభలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. హరివంశ్ సీనియర్ జర్నలిస్టుగా, రాజకీయవేత్తగా సభలో హుందాతనాన్ని కాపాడటంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో సభను నడిపించిన తీరుకు అధికార, ప్రతిపక్షాల నుంచి ప్రశంసలు అందాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

Next Story