ఘనంగా జగన్నాథుడి రథయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు

by Naga Rani Yarlagadda |

పూరీలో జగన్నాథుడి రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. పూరీ రాజు గజపతి దివ్యసింగ్ దేవ్.చెరాపహరా చేసి హారతులిచ్చారు.

ఘనంగా జగన్నాథుడి రథయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: పూరీలో జగన్నాథుడి రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. పూరీ రాజు గజపతి దివ్యసింగ్ దేవ్.చెరాపహరా చేసి హారతులిచ్చారు. ఈ రథయాత్రను కన్నులారా వీక్షించేందుకు.. స్వామివారి రథాన్ని ముందుకు లాగేందుకు భారీ సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకున్నారు. పూరీ వీధులన్నీ ప్రపంచ నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కాగా.. ఈ రథోత్సవాన్ని శ్రీ గుండిచ యాత్ర అని కూడా పిలుస్తారు. ఒడిశాలో ఏటా జరుపుకునే ప్రధాన హిందూ పండుగ ఇది. ఆషాఢమాసంలో రెండవరోజు (ద్వితీయ) స్వామివారి రథయాత్ర నిర్వహిస్తారు. రథయాత్రలో జగన్నాథుడిని దర్శించుకుంటే మోక్ష లభిస్తుందని భక్తుల నమ్మకం.

జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర తమ నివాసమైన 12వ శతాబ్దపు పుణ్యక్షేత్రం నుండి గుండిచా ఆలయానికి తొమ్మిది రోజుల నివసిస్తూ బయలుదేరడానికి ప్రతీకగా రథయాత్ర జరుపుతారు. భక్తులు పరమానందంతో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల - నందిఘోష్, తాలధ్వజ, దర్పదలన్ అని పిలిచే రథాలను సుమారు 3 కిలోమీటర్ల దూరం లాగుతారు.

తొమ్మిది రోజుల పాటు జరిగే రథయాత్ర ఉత్సవం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదంచెల భద్రతా ఏర్పాట్లు చేసింది. ఒడిశా పోలీసులు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, హోమ్ గార్డ్‌లు కలిపి 10 వేల మందితో బందోబస్త్ నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్-అండ్-కంట్రోల్ సిస్టమ్, ఇతర సబ్-కంట్రోల్ రూమ్‌లలో ఉన్న పోలీసు అధికారులు ఉత్తర స్క్వేర్ నుండి పూరి టౌన్ వరకు, పూరి నుండి కోణార్క్ వరకు ఏర్పాటు చేసిన సుమారు 275 AI- ఎనేబుల్డ్ CCTVల నుండి ప్రత్యక్ష ఫీడ్‌ల ద్వారా ట్రాఫిక్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.

Next Story