గోవా మృతులకు పరిహారం ప్రకటించిన సీఎం

by Muthe.Rajitha |

గోవా నైట్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

గోవా మృతులకు పరిహారం ప్రకటించిన సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : గోవా నైట్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు పర్యాటకులతో స్టాఫ్ సిబ్బంది 25 మంది ప్రాణాలు కోల్పోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా అగ్నిప్రమాద బాధితులకు గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరిహారం ప్రకటించారు. 25 మంది మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో గోవా నైట్ క్లబ్ మేనేజర్ తో సహా మరో ముగ్గురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రమాదం జరిగినపుడు క్లబ్ లో 100 మంది వరకు ఉన్నారని, ఎగ్జిట్ ద్వారం చిన్నగా ఉండటం వల్లనే మృతుల సంఖ్య భారీగా పెరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది.

Next Story