వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే మా పొత్తు.. క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం

by Disha Web Desk 19 |
వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే మా పొత్తు.. క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో బీజేపీతో తమ పొత్తు కొనసాగుతుందని అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో తమకు ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. గురువారం చెన్నైలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. 2019, 2021లో బీజేపీతో ఎలాంటి పొత్తు ఉందో రాబోయే ఎన్నికల్లోనూ అలాంటి పొత్తు కొనసాగుతుందని చెప్పారు.

ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన మరుసటి రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అన్నమలైతో ఇబ్బందులు ఉన్నాయా అనే ప్రశ్నకు బదులిస్తూ తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని.. మీడియా తమ మధ్య చీలిక తీసుకువచ్చేందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతోందని ఆరోపించారు. అన్నాడీఎంకే, బీజేపీ ఎవరైనా తమ పార్టీ ఎదుగుదలను చూసుకుంటానని గతంలో తామ కూటమి అధికారంలో ఉండగా పార్టీల మధ్య సిద్ధాంతాలు వేరు వేరుగా ఉన్నప్పటికీ కలిసి పని చేసేవారమన్నారు. కానీ ఇప్పుడు డీఎంకే కూటమిలో అలాంటి పరిస్థితి లేదని విమర్శించారు.

Next Story