- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఊబకాయంపై పోరాటం.. మెగాస్టార్ ఫ్మారులా ఫాలో అవుతున్న ప్రధాని మోడీ

దిశ, వెబ్డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఊబకాయం (Obesity) సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల హృదయ సంబంధ సమస్యలు, మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఊబకాయంపై అవగాహన కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ( PM Modi) సంకల్పించారు. ఈ సందర్భంగా ఆయన 119వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ సమస్యపై ప్రసంగించారు. అంతేకాదు, ప్రజల్లో దీనిపై అవగాహన పెంచేందుకు వివిధ రంగాలకు చెందిన 10 మంది ప్రముఖులను నామినేట్ చేశారు.
దేశంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారుతుందని ప్రధాని మోడీ అన్నారు. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊభకాయం సమస్యతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ప్రతి ఒక్కరూ వంటనూనె వినియోగాన్ని 10 శాతం మేర తగ్గించుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. WHO డేటాను ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారని మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలని పది మందిని నామినేట్ చేస్తూ ఎక్స్లో పోస్టు పెట్టారు. ఒక్కొక్కరు మరో 10 మందిని నామినేట్ చేయాలని ఆయన వారిని కోరారు.
ప్రధాని నామినేట్ చేసిన ప్రముఖులు వీరే..
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా
వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా
ప్రముఖ నటుడు మోహన్లాల్
ప్రముఖ నటుడు మాధవన్
నటుడు దినేశ్లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా
షూటింగ్ ఛాంపియన్ ఒలింపిక్ విజేత మను భాకర్
వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని
గాయని శ్రేయ ఘోషల్
రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి
As mentioned in yesterday’s #MannKiBaat, I would like to nominate the following people to help strengthen the fight against obesity and spread awareness on reducing edible oil consumption in food. I also request them to nominate 10 people each so that our movement gets bigger!… pic.twitter.com/bpzmgnXsp4
— Narendra Modi (@narendramodi) February 24, 2025