ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

by Disha Web Desk 4 |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన జమ్ముకశ్మీర్ లోని దచన్ దగ్గర చోటుచేసుకుంది. కార్మికులతో వెళ్తున్న క్రూజర్ వాహనం ఒక్క సారిగా బోల్తాపడింది. దీంతో ఆరుగురు కార్మికులు స్పాట్ లోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. కార్మికులంతా దగ్దూర్ పవర్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ యాక్సిడెంట్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed