కుటుంబ పాలన తమిళనాడును దోచుకుంటుంది: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

by Malleboina Mahesh |

తమిళనాడులో స్టాలిన్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని పీయూష్ గోయల్ విమర్శ. ఈపీఎస్ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి తమిళనాడుకు పూర్వ వైభవం తెస్తుందని వెల్లడి.

కుటుంబ పాలన తమిళనాడును దోచుకుంటుంది: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేవలం ఒకే కుటుంబం పాలన సాగుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, ఎంపీ కనిమొళి.. ఇలా కుటుంబ సభ్యులంతా కలిసి తమిళనాడును దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ కుటుంబ పాలన వల్ల దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా తమిళనాడు ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తమిళ సంస్కృతి, భాష మరియు సాహిత్యానికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని గోయల్ పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందడానికి అవసరమైన అన్ని వనరులు తమిళనాడులో ఉన్నాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సంభావ్యతను నీరుగారుస్తోందని అన్నారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో, ఈపీఎస్ (EPS) నాయకత్వంలోని ఎన్డీయే కూటమి తమిళనాడుకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా ప్రజలు కోరుకుంటున్న సుపరిపాలనను అందించి, తమిళ గర్వాన్ని, గొప్ప సంప్రదాయాలను కాపాడతామని ఆయన స్పష్టం చేశారు.

Next Story