మే 19న ‘ఆపరేషన్ సిందూర్‌’పై పార్లమెంటరీ కమిటీకి వివరణ

by Phanindra |

ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటరీ కమిటీకి విక్రమ్ మిస్రీ వివరణ ఇవ్వనున్నారు. మే 19న ఈ సమావేశం జరగనుంది.

మే 19న ‘ఆపరేషన్ సిందూర్‌’పై పార్లమెంటరీ కమిటీకి వివరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్ సిందూర్’ గురించి పార్లమెంటరీ కమిటీకి వచ్చే వారంలో విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ వివరణ ఇవ్వనున్నారు. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలను కమిటీకి మే 19న మిస్రీ వివరిస్తారు. స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఇప్పటికే ఈ సమాచారన్ని విదేశాంగ శాఖ తెలియజేసిందట. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జరిగిన మిలటరీ చర్యలు, అలాగే పాకిస్తాన్‌తో ఇకపై భారత్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? వంటి విషయాలను మిస్రీ సవివరంగా పార్లమెంటరీ కమిటీకి వివరించనున్నారు.

Next Story