మోడీని ఆశీర్వదించిన ఏనుగు: వీడియో వైరల్

by Dishanational2 |
మోడీని ఆశీర్వదించిన ఏనుగు: వీడియో వైరల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీని ఆశీర్వదిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని ఓ ఆలయంలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రామాలయ ప్రతిష్టాపన వేడుకకు ముందు శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ప్రధానమంత్రిని ప్రార్ధనలు చేశారు. అనంతరం ఆలయం వద్దే ఉన్న అండాల్ అనే ఏనుగు వద్దకు వెళ్లారు. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న మోడీ ఏనుగును తదేకంగా చూస్తూ నిలబడ్డారు. అనంతరం ఏనుగుకు పశుగ్రాసం తినిపించాడు. ఆ తర్వాత ఏనుగు ప్రధాని మోడీని ఆశీర్వదించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ప్రధాని శ్రీరంగ ఆలయాన్ని సందర్శించడంతో భక్తులు సంతోషంగా ఉన్నారు. ఇంతకు ముందు, ఏ ప్రధానమంత్రి కూడా శ్రీరంగానికి రాలేదు. ఒక ప్రధాని ఇక్కడికి రావడం పట్ల గర్విస్తున్నాం’ అని ఆలయ ప్రధాన పూజారి సుందర్ భట్టర్ తెలిపారు.

Next Story

Most Viewed