- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నేడు (ఆదివారం, మార్చి 15, 2026) ముహూర్తం ఖరారు చేయనుంది.

దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నేడు (ఆదివారం, మార్చి 15, 2026) ముహూర్తం ఖరారు చేయనుంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించేందుకు ఈసీ సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలోనే ఏయే రాష్ట్రాల్లో ఎన్ని విడతల్లో ఎన్నికలు జరుగుతాయి, నోటిఫికేషన్ ఎప్పుడు, పోలింగ్ తేదీలు మరియు ఫలితాల వెల్లడి వంటి పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ నాలుగు రాష్ట్రాలు మరియు పుదుచ్చేరి అసెంబ్లీల పదవీకాలం ఈ ఏడాది మే మరియు జూన్ నెలల్లో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. ఈ లోపే కొత్త ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను పూర్తి చేశారు. ఐదు ప్రాంతాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను కూడా అధికారులు ఇప్పటికే ప్రచురించారు.
ఏ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంది?
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ పోరు నెలకొనే అవకాశం ఉంది. తమిళనాడులో డీఎంకే తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుండగా, అన్నాడీఎంకే మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇక కేరళ & అస్సాంలలో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశాయి. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) తక్షణమే అమలులోకి రానుంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థుల ఎంపిక మరియు మేనిఫెస్టోల రూపకల్పనలో వేగం పెంచనున్నాయి.






