లిక్కర్ స్కాం కేసు: మనీష్ సిసోడియా పీఏకు ఈడీ సమన్లు

by Sathputhe Rajesh |   (  Updated:2023-03-18 02:49:12  IST  )

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడుగా వ్యవహరింస్తోంది.

లిక్కర్ స్కాం కేసు: మనీష్ సిసోడియా పీఏకు ఈడీ సమన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడుగా వ్యవహరింస్తోంది. తాజాగా లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పీఏకు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీష్ సిసోడియా పీఏ దేవేంద్రకు ఈడీ నోటీసులు పంపింది. ఈ రోజు ఉదయం విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈడీ ప్రధాన కార్యాలయంలో సిసోడియా పీఏ దేవేంద్రను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. కాగా నేడు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఏపీ వైసీపీ ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Next Story