వందే మాతరంపై చర్చ ఎప్పటికీ ముఖ్యం.. 2047 లక్ష్య సాధనకు ఇదే కీలకం: అమిత్ షా

by Malleboina Mahesh |

వందే మాతరంపై చర్చ ఎప్పటికీ ముఖ్యం.. 2047 లక్ష్య సాధనకు ఇదే కీలకం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

వందే మాతరంపై చర్చ ఎప్పటికీ ముఖ్యం.. 2047 లక్ష్య సాధనకు ఇదే కీలకం: అమిత్ షా
X

దిశ, వెబ్ డెస్క్: వందే మాతరంపై చర్చ ఎప్పటికీ ముఖ్యం.. 2047 లక్ష్య సాధనకు ఇదే కీలకం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) స్పష్టం చేశారు. నిన్న "వందే మాతరం"పై లోక్‌సభలో చర్చించాల్సిన ఆవశ్యకత గురించి కొందరు సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారని, అయితే అటువంటి చర్చలు ఇప్పుడు ఎంతైనా అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వందే మాతరం పట్ల అంకితభావం అప్పట్లో ముఖ్యమైనది, ఇప్పుడు అవసరం, 2047 నాటికి మనం ఊహించిన ఉజ్వల భవిష్యత్తుకు ఇది ఎల్లప్పుడూ ముఖ్యమైనదిగా ఉంటుందని అమిత్ షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కొందరు ఈ చర్చలను రాబోయే బెంగాల్ ఎన్నికలకు ముడిపెట్టి, జాతీయ గీత ఔన్నత్యాన్ని తగ్గించాలని చూస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వందే మాతరం యొక్క స్వరకర్త బంకిమ్ బాబు బెంగాల్‌కు చెందిన వారేనని, ఆనంద్ మఠ్ మూలం కూడా బెంగాల్‌లోనే ఉందని అంగీకరించినప్పటికీ, వందే మాతరం నినాదం బెంగాల్‌కో, దేశానికో పరిమితం కాలేదని అమిత్ షా స్పష్టం చేశారు. దేశ సరిహద్దుల్లోని సైనికుడు, దేశాన్ని కాపాడుతున్న పోలీసులు తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసినప్పుడు, వారు పలికే ఏకైక నినాదం వందే మాతరం మాత్రమేనని అమిత్ షా రాజ్య సభ (Rajya Sabha)లో ఉద్వేగంగా తెలిపారు.

Next Story