- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ పేలుడు.. అత్మహుతిగా అనుమానం
by Muthe.Rajitha |
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 10 కి చేరింది. మరో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా ఈ పేలుడు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పోలీస్ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 6.52గంటల సమయంలో ఈ పేలుడు జరిగినట్లు వెల్లడించారు.
ఎర్రకోట సమీపంలో నిదానంగా వచ్చి రెడ్లైట్ వద్ద కారు ఆగిందని, ఆగి ఆగుతుండగానే ఒక్కసారిగా పేలుడు జరిగిందని వివరించారు. అయితే ఇది ఆత్మహుతి దాడి అయి ఉండవచ్చనే కోణంలోనూ పోలీసులు అనుమానం వ్యక్తం చేసారు. అయితే ఘటనా స్థలంలో ఒక బుల్లెట్ కూడా లభ్యం అయినట్టు సమాచారం.
Next Story






