ఢిల్లీ బ్లాస్ట్.. పిండిమరతో బాంబులు తయారీ

by Muthe.Rajitha |

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడులో 15 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ బ్లాస్ట్.. పిండిమరతో బాంబులు తయారీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడులో 15 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో షాకింగ్ విషయాలు బయటికి వస్తున్నాయి. నిందితులు పేలుడు పదార్థాలను తయారు చేయడానికి పిండిమరను వాడినట్టు వెలుగులోకి వచ్చింది. పిండిమర సాయంతో యూరియాను గ్రైండ్ చేసి మెత్తగా రుబ్బి, ఎలక్ట్రికల్ మెషీన్లతో రిఫైన్ చేసి బాంబులకు కావాల్సిన కెమికల్స్‌ను సిద్ధం చేసినట్లు ప్రధాన నిందితుల్లో ఒకడైన ముజమ్మిల్ షకీల్ విచారణలో వెల్లడించాడు. దీని ఆధారంగా ఫరీదాబాద్‌లో అద్దెకు తీసుకున్న ట్యాక్సీ డ్రైవర్ ఇంటి నుంచి అధికారులు పిండి మర, కొన్ని ఎలక్ట్రికల్ మెషీన్లను సేకరించారు. కాగా గతంలో అక్కడే 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ కూడా లభ్యమైంది. అధికారులు ట్యాక్సీ డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Next Story