- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 28న పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon sessions of Parliament) సోమవారం (జులై 21) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్లమెంట్లో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్పై (Operation Sindoor) చర్చించనున్నారు. ఈ చర్చలు లోక్సభలో జులై 28న, రాజ్యసభలో జులై 29న జరుగుతాయి. రెండు సభల్లోనూ ఈ చర్చకు 16 గంటల సమయం కేటాయించారు. జులై 21న జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి అంతరాయాలు లేకపోతే, ఈ షెడ్యూల్ ప్రకారం చర్చలు జరుగుతాయి.
ఈ చర్చలో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడే అవకాశం ఉంది. విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఈ చర్చలో తప్పనిసరిగా మోడీ పాల్గొని దేశానికి సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఇక రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ అధ్యక్షతన ఈ చర్చ నిర్వహించబడుతుంది. ఎందుకంటే.. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చర్చలు కార్గిల్ విజయ దివస్కు (జులై 26న) రెండు రోజుల ముందు జరగనుండటం వల్ల, ప్రభుత్వం ఈ అంశాన్ని జాతీయ గర్వంతో ముడిపెట్టి, తమ బలమైన వైఖరిని ప్రదర్శించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే, ఈ చర్చలు రాజకీయంగా ఉత్కంఠభరితంగా ఉండే అవకాశం ఉంది.
కాగా, పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది పర్యటకులు మరణించారు. దీనితో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి, పాక్, పీఓకేల్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసి వాటిని నేలమట్టం చేసింది. తర్వాత భారత్, పాక్ మధ్య ఘర్షణలు చెలరేగాయి. చివరికి భారత్ దెబ్బకు పాక్ తోక ముడిచి సంధికి దిగొచ్చింది. అయితే ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని భారత్ చెబుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో భారత పార్లమెంట్లో ఆ అంశాలపై చర్చ జరిగితే అది ప్రపంచం దృష్టిని కూడా ఆకర్శించే అవకాశం ఉంది.






