- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బకెట్ను తాకినందుకు దళిత బాలుడిపై దాడి..రాజస్థాన్లో దారుణం
by Dishanational2 |
X
దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. తమ బకెట్ను తాకాడనే కారణంతో ఓ దళిత బాలుడిపై అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అల్వార్ జిల్లా రామ్గఢ్ ప్రాంతంలోని పాఠశాలలో దళిత సామాజిక వర్గానికి చెందిన చిరాగ్ అనే బాలుడు నాలుగో తరగతి చదువుతున్నాడు. అయితే పాఠశాలలోని బోరింగ్ దగ్గరికి మంచి నీళ్లు తాగేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే బోరింగ్ వద్ద రతీరామ్ ఠాకూర్ అనే అగ్రవర్ణ వ్యక్తికి చెందిన బకెట్ ఉండగా..దానిని బాలుడు తాకాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఠాకూర్ బాలుడిని చితకబాదగా గాయాలయ్యాయి. బాలుడి తండ్రి పన్నాలాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు రామ్గఢ్ పోలీస్ అధికారి సవాయ్ సింగ్ తెలిపారు. కాగా, బాలుడి కుటుంబీకులను కూడా ఠాకూర్ బెదిరించినట్టు తెలుస్తోంది.
Next Story