ఆశా ఫరేఖ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

by Disha Web Desk 2 |
ఆశా ఫరేఖ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటి ఆశా ఫరేఖ్‌కు అరుదైన గౌరవం లభించింది. సినీ ప్రరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహేబ్ ఫాల్కే అవార్డులను ప్రకటించారు. 2023 సంవత్సరానికి గాను ప్రముఖ సినీ నటి ఆశా ఫరేఖ్‌కు దాదాసాహేబ్ ఫాల్కే అవార్డును అందించనున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. సెప్టెంబర్ 30వ తేదీన నిర్వహించే ఈ అవార్డుల ప్రధానోత్సవంలో ఆమెకు అందించనున్నట్లు తెలిపారు. కాగా, 1992లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డు సైతం అందజేసింది. హిందీతోపాటు గుజరాతీ, పంజాబీ, కన్నడ చిత్రాల్లోనూ ఆమె నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్నారు.

Next Story

Most Viewed