- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిచ్చి పీక్స్: బైక్తో రైలును లాగే ప్రయత్నం.. నెటిజన్ల ఫైర్
పశ్చిమ బెంగాల్కు చెందిన సోహెల్ అనే యువకుడు తన బైక్తో ఏకంగా రైలును లాగేందుకు చేసిన పిచ్చి ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్కు చెందిన సోహెల్ అనే యువకుడు తన బైక్తో ఏకంగా రైలును లాగేందుకు చేసిన పిచ్చి ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల ఓ ‘ఎంజీ మెజెస్టర్’ కారు రైలును లాగి గిన్నిస్ రికార్డు సాధించగా, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ రికార్డును బ్రేక్ చేయాలనే అత్యాశతో ఈ యువకుడు ఈ ప్రమాదకర స్టంట్కు పాల్పడ్డాడు. స్టేషన్లో ఆగి ఉన్న రైలుకు ఓ తాడును కట్టి తన బైక్తో ముందుకు లాగేందుకు సోహెల్ విశ్వప్రయత్నం చేశాడు. అయితే, బైక్ వెనుక టైరు అక్కడే గిర్రున తిరుగుతూ ఉండిపోయిందే తప్ప రైలు అంగుళం కూడా కదలలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది.
యువకుడి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం
ఈ వీడియో చూసిన నెటిజన్లు యువకుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం లైకుల కోసం, ఫేమస్ అవ్వడం కోసం ప్రాణాలతో చెలగాటం ఆడటమే కాకుండా, రైల్వే ట్రాక్లపై ఇలాంటి అనుమతి లేని, చట్టవిరుద్ధమైన స్టంట్స్ చేయడం దారుణమంటూ మండిపడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పిచ్చి వేషాలు పునరావృతం కాకుండా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), ఇతర అధికారులు సదరు యువకుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






