మరోసారి కరోనా విజృంభణ.. 5 నెలల్లో ఇదే అత్యధికం

by Disha Web Desk 12 |
మరోసారి కరోనా విజృంభణ.. 5 నెలల్లో ఇదే అత్యధికం
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో అదుపులోకి వచ్చింది అనుకున్న కరోనా మరోసారి విజృంభిస్తుంది. నెమ్మదిగా కంటికి కనిపించకుండా.. చాపకింద నీరులా కరోనా కేసులు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,151 కొత్త కరోనావైరస్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని ప్రకారం ఈ పెరుగుదల 5 నెలల్లో అత్యధిక కావడం విశేషం దీంతో ప్రస్తుతం భారత్ లో కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య 11,903కి పెరిగింది. అలాగే కరోనాతో మరో నలుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5,30,848కి చేరుకుంది. ప్రస్తుతం భారత్ లో కరోనా రోజువారీ సానుకూలత రేటు 1.51% శాతంగా ఉంది.

Next Story

Most Viewed