పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం

by Disha Web Desk 1 |
పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా వేయికి పైగా కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ఈ క్ర‌మంలోనే క‌రోనా వైర‌స్ కేసులు అధికంగా నివేదిస్తున్న ఆరు రాష్ట్రాలను హెచ్చరిస్తూ కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గ‌త‌వారం ఒక లేఖ రాసింది. క‌రోనావైర‌స్ సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి, నియంత్రించడానికి రిస్క్ అసెస్మెంట్ ఆధారిత విధానాన్ని అనుసరించాలని లేఖ‌లో కోరింది. ఈ నేప‌థ్యంలోనే కోవిడ్ నివారణకు సన్నద్ధం కావడానికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో కరోనా నివారణకు సంబంధించిన ఏర్పాట్లను గురించి చ‌ర్చించ‌నున్నారు.

Next Story

Most Viewed