కరోనా అలర్ట్.. మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు..

by Disha Web Desk 12 |
కరోనా అలర్ట్.. మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు..
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పేరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 3,823 కొత్త COVID-19 కేసులు నమోదైనట్లు భారత ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా శనివారం 2,994 కరోనావైరస్ కేసులు నమోదైన మరుసటి రోజే ఇలా నాలుగు వేలకు దగ్గర్లో పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. కాగా ఒక్క రోజులోనే 3,823 కొత్త పాజిటివ్ కేసులు నమోదవడంతో ఈ ఏడాదిలో ఇదే అత్యధిక పెరుగుదల గా నిలిచింది. దీంతో ప్రస్తుతం భారత్ లో క్రియాశీల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,389కి పెరిగింది. అలాగే మరో నాలుగు కరోనా కారణంగా మరణించినట్లు తెలుస్తుంది.

Next Story