లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై పోటీ చేసేది ఎవరో తెలుసా ?

by Dishanational4 |
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై పోటీ చేసేది ఎవరో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఆరో జాబితాను సోమవారం విడుదల చేసింది. ఇందులో రాజస్థాన్‌లోని 4, తమిళనాడులోని 1 స్థానానికి అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. అజ్మీర్‌ నుంచి రామచంద్ర చౌదరి, రాజ్‌సమంద్‌ నుంచి సుదర్శన్‌ రావత్‌, భిల్వారా నుంచి డాక్టర్‌ దామోదర్‌ గుర్జర్‌‌లను బరిలోకి దింపింది. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మాజీ నేత ప్రహ్లాద్ గుంజాల్ రాజస్థాన్‌లోని కోటా స్థానం నుంచి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై పోటీ చేయనున్నారు. తమిళనాడులోని తిరునల్వేలి నుంచి అడ్వకేట్ సి. రాబర్ట్ బ్రూస్‌కు కాంగ్రెస్ లోక్‌సభ టికెట్ ఇచ్చింది. తమిళనాడులోని విలవంకోడ్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా డాక్టర్ తరహై కుత్‌బర్ట్‌ను ప్రకటించింది. ఇప్పటి వరకు ఆరు జాబితాల్లో మొత్తం 190 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.

Next Story

Most Viewed