6 టన్నుల గులాబీలతో ప్రియాంక గాంధీకి ఘన స్వాగతం (వీడియో)

by Disha Web Desk 2 |
6 టన్నుల గులాబీలతో ప్రియాంక గాంధీకి ఘన స్వాగతం (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఛత్తీస్‌గడ్‌ రాజధాని రాయ్‌పూర్‌ గులాబీ పూలమయం అయింది. శనివారం కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యేందుకు రాయ్‌పూర్‌కు చేరుకున్న ప్రియాంక గాంధీపై కాంగ్రెస్ శ్రేణులు పూల వర్షం కురిపించారు. భారీసంఖ్యలో కాంగ్రెస్ నేతలు చేరుకుని రోడ్డుపై ఎర్ర గులాబీలను తివాచీలా అలంకరించి ప్రియాంకకు ఘనస్వాగతం పలికారు.

ఉదయం 8.30 గంటలకు ప్రియాంక గాంధీ రాయ్‌పూర్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా.. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్ బఘెల్, పీసీఎస్ చీఫ్ మోహన్ మార్కం, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ర్యాలీగా కాన్వాయ్పై బయలుదేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెపై గులాబీ పూలవర్షం కురిపించారు. బుట్టల కొద్దీ గులాబీలను చల్లుతూ అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా దారిపై పొడవునా దాదాపు 6 టన్నుల గులాబీపూలను పేర్చారు. అటు కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతంతో ప్రియాంకగాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed