ఎంపీ బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ

by Dishafeatures2 |
ఎంపీ బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్: పరువు నష్టం కేసులో ఎంపీ పదవిని కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్ లోని అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. 2019 నాటి పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించగా.. దాన్ని ఆధారంగా చేసుకొని లోక్ సభ ఆయనను ఎంపీ పదవి నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 22 వరకు అధికార నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్ సభ హౌజింగ్ కమిటీ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది.

ఈ క్రమంలోనే శనివారం రాహుల్ గాంధీ తనకు కేటాయించిన అధికార నివాసాన్ని ఖాళీ చేసి.. అందులోని వస్తువులను తన తల్లి సోనియాగాంధీ నివాసమైన 10 జన్ పథ్ కు తరలించారు. 2004 నుంచి రాహుల్ గాంధీ 12 తుగ్లక్ లేన్ లోని బంగ్లాలో ఉంటున్నారు. దాదాపు 19 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ ఈ బంగ్లాను ఖాళీ చేశారు.

Next Story

Most Viewed