కర్నాకటలో కాంగ్రెస్ భారీ విజయం సాధించబోతోంది: మల్లిఖార్జున ఖర్గే

by Disha Web Desk 19 |
కర్నాకటలో కాంగ్రెస్ భారీ విజయం సాధించబోతోంది: మల్లిఖార్జున ఖర్గే
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ పాలనలో కర్ఱాటక ప్రజలు విసిగిపోయి ఉన్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఓటు వేసిన ఆయన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించబోతోందని చెప్పారు. తొలి కేబినెట్ ఏర్పడిన వెంటనే ఐదు హామీలను నెరవేరుస్తామని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ప్రతీ ఓటు మార్పునకు నాంది అని చెప్పారు. సామాజిక న్యాయం, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. రాజ్యాంగ పరిరక్షణ, కర్ణాటక ప్రగతి కోసం తాను ఓటే వేశానని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.



Next Story

Most Viewed