రెండో పెళ్లికి సిద్ధమైన కలెక్టర్లు.. చివరి నిమిషంలో అదిరిన ట్విస్ట్!

by Disha Web Desk 6 |
రెండో పెళ్లికి సిద్ధమైన కలెక్టర్లు.. చివరి నిమిషంలో అదిరిన ట్విస్ట్!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రేమ ఎప్పుడు ఎలా? ఎవరిపై మొదలవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇటీవల చాలా మంది ప్రేమ వివాహాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. అయితే ఒడిశాకు చెందిన ఇద్దరు కలెక్టర్లు కూడా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పడంతో వీరికి పెళ్లికి వారు కూడా అనుమతినిచ్చారు. దీంతో ఈ నెల 15వ తేదీన వీరు వివాహ బంధంతో ఇక్కటవ్వబోతున్నారు.

వివరాల్లోకి వెళితే.. పూరికి చెందిన సమర్థ వర్మ, రాయగడకు చెందిన కలెక్టర్ స్వధాదేవ్ సింగ్ ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని జీవితాన్ని కొనసాగించాలని అనుకున్నారు. దీనికి వారి పెద్దలు ఒప్పుకోవడం తో మే 15న వీరు వివాహం చేసుకోబోతున్నారు. అయితే వీరు రెండవ పెళ్లి చేసుకుంటున్నట్లు సమాచారం. స్వధాదేవ్ సింగ్ కొంత కాలం క్రితం బొలంగీర్ కలెక్టర్‌ చంచల రాణాను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. అలాగే పూరీ కలెక్టర్ సమర్థ వర్మకు కూడా ఇటీవల రైల్వే అదికారిణి సుచిసింగ్‌ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత స్వధా, సమర్థ వర్మ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. కాగా వారి పెళ్లికి పూరీకి చెందిన కొంత మంది సేనాయత్‌లను కూడా ఆహ్వనించినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed