ధర్మేంద్ర రాజీనామా.. కేంద్రంతో మరోసారి సీజేపీ చర్చలు

by Ajay Maddhiboyina |

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా త‌ర‌వాత మ‌రోసారి కేంద్రం సీజేపీ పార్టీ ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు ప్రారంభించింది. ధర్మేంద్ర రాజీనామాకు ముందు సీజేపీ నేతలను పిలిచి వారితో చర్చించిన కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంత్ర సింగ్ రాజీనామా తరవాత భేటీ అవడం ఆసక్తికరంగా మారింది.

ధర్మేంద్ర రాజీనామా.. కేంద్రంతో మరోసారి సీజేపీ చర్చలు
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా త‌ర‌వాత మ‌రోసారి కేంద్రం సీజేపీ పార్టీ ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు ప్రారంభించింది. ధర్మేంద్ర రాజీనామాకు ముందు సీజేపీ నేతలను పిలిచి వారితో చర్చించిన కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంత్ర సింగ్ రాజీనామా తరవాత భేటీ అవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సీజేపీ ప్రతినిధుల మూడు డిమాండ్ లలో రెండు డిమాండ్లకు కేంద్రం ఓకే చెప్పింది. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం, నీట్ పేపర్ లీక్ తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం అందించేందుకు కేంద్రం ఇప్పటికే ఓకే చెప్పింది. మూడో డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాగా ఇప్పటికే ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి కేంద్రమంత్రులు సీజేపీ ప్రతినిధులతో భేటీలో ఏం చర్చిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story