- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేరు మార్చండి.. ఆత్మవిశ్వాసం పెంచండి: రాజస్థాన్ సర్కార్ వినూత్న నిర్ణయం
రాజస్థాన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల వింత పేర్లను మార్చేందుకు 'సార్థక్ నామ్ అభియాన్' ప్రారంభం.

దిశ, వెబ్డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పాఠశాలల విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావాన్ని తొలగించి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం (Rajasthan Government) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘సార్థక్ నామ్ అభియాన్’ (Sarthak Naam Abhiyan) పేరుతో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇందులో భాగంగా అర్థరహితంగా, వింతగా ఉన్న విద్యార్థుల పేర్లను గౌరవప్రదమైన పేర్లుగా మార్చనున్నారు. అయితే, చాలామంది తల్లిదండ్రులు అవగాహన లేక లేదా చిన్నప్పుడు సరదాగా షైతాన్, షేరు, కాలు, టింకూ వంటి పేర్లను పెట్టినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే విద్యార్థులు పెరిగి పెద్దయ్యాక, ఆ పేర్లు పట్టుకుని తోటి విద్యార్థుల హేళన చేస్తుండటంతో కొందరు సిగ్గు, అవమానంతో పాఠశాలలకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ మంత్రి వర్గంలో నిర్ణయించి ‘సార్థక్ నామ్ అభియాన్’ పేరుతో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
3 వేల కొత్త పేర్లతో జాబితా..
ఈ కార్యక్రమం కోసం విద్యాశాఖ సుమారు 3 వేల అర్థవంతమైన పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. ఆరవ్, అథర్వ, బాలముకుంద్, బద్రీనాథ్ వంటి 1,409 పేర్లు, ఇక బాలికలకు ఆరాధ్య, అన్నపూర్ణ, వైష్ణవి వంటి 1,541 పేర్ల జాబితాను తల్లిదండ్రులకు అందించి, వారి రాతపూర్వక అనుమతితోనే 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల పేర్లను అధికారిక రికార్డుల్లో మారుస్తారు. పిల్లల వ్యక్తిత్వ వికాసంలో పేరు కీలక పాత్ర పోషిస్తుందని, అర్థవంతమైన పేర్లు వారిలో గౌరవాన్ని, ధైర్యాన్ని నింపుతాయని ప్రభుత్వం పేర్కొంది. కులాల పేర్లతో ముడిపడి ఉన్న లేదా అవమానకరంగా అనిపించే పదాలను కూడా రికార్డుల నుంచి తొలగించాలని సర్కార్ విద్యాశాఖ అధికారులకు స్పష్టం చేసింది.






