- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్ మీడియాపై నిషేధం ఎత్తివేసిన కేంద్రం
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) వేళ పాకిస్తాన్(Pakistan) మీడియాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.

దిశ, వెబ్డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) వేళ పాకిస్తాన్(Pakistan) మీడియాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. పాక్ సెలబ్రిటీల అకౌంట్లపైనా బ్యాన్ ఎత్తివేసింది. ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండానే వారి ఇన్స్టా గ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ ఎత్తేసింది. మాజీ పాక్ స్టార్ క్రికెటర్ షాహిదీ ఆఫ్రిదీ, సబా కమర్, మావ్రా హొకేన్, అహద్ రజా మీర్, హనియా అమీర్, యుమ్నా జైదీ, డానిష్ తైమూర్ వంటి అనేక మంది పాకిస్తానీ ప్రముఖుల ఇన్స్టాగ్రామ్ ఖాతాలు భారత్లో ఓపెన్ అవుతున్నాయి. కాగా, జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాంలో ఉగ్రవాదులు భారత టూరిస్టులను దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో పాకిస్తాన్ మీడియా, ప్రముఖులపై భారత్ నిషేధించింది.






