కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

by Disha Web Desk 17 |
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
X

న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కరువు భత్యాన్ని(డీఏ) 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రధాని మోడీ నేతృత్వంలో శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో ప్రస్తుతం 38 శాతం నుంచి 42 శాతానికి డీఏ పెరుగుతుందని చెప్పారు. ఈ పెంపు జనవరి నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించారు.

తాజా నిర్ణయంతో కేంద్రంపై ప్రతి ఏటా రూ. 12,815 కోట్ల అదనపు భారం పడనుంది. దీని ద్వారా 47.58 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69.76 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. 7వ పే కమిషన్ ప్రతిపాదనల ఆధారంగా కేంద్రం ఈ పెంపుదలకు ఆమోదం తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం డీఏను 34 నుంచి 38 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed