- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేద ఖైదీల బెయిల్ మంజూరుకు కేంద్రం ఆర్థిక సాయం
పేద ఖైదీల(Poor Prisoners) బెయిల్ మంజూరుకు సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : పేద ఖైదీల(Poor Prisoners) బెయిల్ మంజూరుకు సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. పేద ఖైదీలు బెయిల్(Bail) పొందేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు, జైళ్లశాఖ డీజీలకు ఇటీవల కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఈ స్కీమ్ కింద అర్హులైన వారి జాబితా రూపొందిస్తే వాళ్లు చెల్లించాల్సిన జరిమానాను కేంద్రమే చెల్లిస్తుంది. రిమాండ్తో పాటు శిక్షపడిన ఖైదీలకు సైతం ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిప్రకారం జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలు నియమించాలి. రిమాండ్ ఖైదీలైనా, శిక్షపడిన వారైనా బెయిల్ వచ్చాక కూడా 7 రోజుల తర్వాత విడుదల కాకపోతే వాళ్ల లిస్ట్ను రూపొందిస్తారు.
ఇందులో జరిమానా చెల్లించలేని వారిని గుర్తిస్తారు. రిమాండ్ ఖైదీల జరిమానా మొత్తం రూ.40 వేల లోపు ఉన్నట్లయితే అంత మొత్తం రిలీజ్ చేయాలని ఈ స్కీమ్కు సెంట్రల్ నోడల్ ఏజెన్సీ (CNA)గా ఉన్న జాతీయ నేరాల నమోదు సంస్థని జిల్లా కమిటీ అభ్యర్థిస్తుంది. దీంతో CNA అంత మొత్తం విడుదల చేస్తుంది. ఒకవేళ జరిమానా రూ.40 వేలకు మించి ఉంటే ఆ విషయాన్ని జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీకి తెలియజేస్తుంది. ఈ తర్వాత రాష్ట్ర కమిటీ దీన్ని పరిశీలించి CNAకు రాస్తుంది. దీంతో ఆ మొత్తాన్ని సీఎన్ఏ విడుదల చేస్తుంది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు ఈ స్కీమ్ కింద అర్హులైన ఖైదీల జాబితాను రాష్ట్రాల్లో సిద్ధం చేస్తున్నారు. అయితే డ్రగ్స్, మనీ ల్యాండరింగ్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాల కింద అరెస్టయిన వాళ్లకి ఈ పథకం వర్తించదు.






